Srilanka Earthquake: శ్రీలంకలో తీవ్ర స్థాయిలో భూకంపం..
భారత్ పక్క దేశం శ్రీలంకలో తీవ్ర స్థాయిలో భూకంపం(Earthquake) సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం శ్రీలంకలో 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. "భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదు అయింది. శ్రీలంకకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. శ్రీలంకకు ఎలాంటి ప్రమాదం లేదని జియోలాజికల్ సర్వే అండ్ మైన్స్ బ్యూరో తెలిపింది.
సోమవారం దక్షిణ సూడాన్ మరియు ఉగాండా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 8 కిమీ (4.97 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. సోమవారం సాయంత్రం తజికిస్థాన్లో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఎన్సిఎస్ తెలిపింది. భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం, సాయంత్రం 5:46 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. 194 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఆదివారం ఇండోనేషియాలోని వెస్ట్ తైమూర్ సమీపంలో ఆదివారం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్జెడ్) తెలిపింది. భూకంప కేంద్రం 10 కిమీ లోతులో ఉందని GFZ తెలిపింది. నవంబర్ 11 సాయంత్రం పాకిస్థాన్లో 4.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సిఎస్) తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ప్రకంపనలు సాయంత్రం 6:06 గంటలకు సంభవించాయి.
Earthquake of Magnitude:6.2, Occurred on 14-11-2023, 12:31:10 IST, Lat: -2.96 & Long: 86.54, Depth: 10 Km ,Location: 1326km SE of Colombo, Sri Lanka for more information Download the BhooKamp App https://t.co/4djY2ype7T@KirenRijiju @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/yqXchM4hZN
— National Center for Seismology (@NCS_Earthquake) November 14, 2023
అదే రోజు హైతీ సరిహద్దుకు సమీపంలో ఉన్న వాయువ్య డొమినికన్ రిపబ్లిక్లో 5 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, లాస్ మాటాస్ డి శాంటా క్రూజ్కు పశ్చిమ-వాయువ్యంగా 19 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఇటు భారత్ లోని ఢిల్లీ కూడా భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.
-
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications