అఫ్గానిస్తాన్: పంజ్షీర్లో ప్రభుత్వ దళాలు, తాలిబాన్లకు మధ్య ‘రక్తపాతం’ తప్పదా? తాలిబాన్ అనుకూల మీడియా ఏం చేస్తోంది?
అఫ్గానిస్తాన్ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత వారికి మద్దతుగా నిలిచిన మీడియా గ్రూపులు ఒకవైపు దేశంలో పరిస్థితి బాగానే ఉందని చూపించే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు తాలిబాన్ శత్రువులను హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి.
అఫ్గానిస్తాన్ అల్ ఎమారాహ్ టీవీ సిబ్బంది గత కొన్ని రోజులుగా కాబుల్ రోడ్లపై కనిపిస్తున్నారు. జనాలతో మాట్లాడుతూ, దేశంలో అంతా ఇప్పుడు మళ్లీ మామూలుగా ఉందని చూపించడానికి ప్రయత్నిస్తున్నారని రాయిటర్స్ చెప్పింది.
ఈ మీడియా సంస్థ తాలిబాన్ మద్దతుగా వీడియోలు ప్రసారం చేస్తుంటుంది.
సిటీ సెంటర్లో అల్-ఎమారాహ్ ప్రతినిధులు ఒక వ్యక్తిని "మీరు ఎంత కచ్చితంగా చెప్పగలరు" అని అడుగుతారు. వారు "వంద శాతం, భద్రత బాగుంది, ఇక్కడ దొంగలెవరూ లేరు, మేం చాలా సంతోషంగా ఉన్నాం" అని చెబుతున్నారు.
గత ఆదివారం అఫ్గానిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత కాబుల్లో అరాచక పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఇది దేశ ప్రజలకు ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నించింది.
వేలాది ప్రజలు ఎయిర్ పోర్ట్ దగ్గర గుమిగూడి, దేశం వదిలి వెళ్లిపోవాలని ఎంతకైనా తెగిస్తుంటే, అల్-ఎమారహ్ మాత్రం తమ ఇంటర్వ్యూల ద్వారా దేశంలో అంతా బాగుందని చూపించాలని ప్రయత్నిస్తోంది.
శనివారం తాలిబాన్ ప్రతినిధులు చాలామంది టీవీ స్టూడియోకు చేరుకున్నారు. కాబుల్లో అన్ని రోడ్లూ సురక్షితంగా ఉన్నాయని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
- 'తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’
- 'మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’

అఫ్గానిస్తాన్ జాతీయ చానల్లో ఉపదేశాలు
మరోవైపు తాలిబాన్ ఆదేశాలతో ప్రభుత్వ టీవీ చానల్లో మతపెద్దలు ఉపదేశాలు వినిపిస్తున్నారు.
బీబీసీ మానిటరింగ్ వివరాల ప్రకారం ఆగస్టు 20న అఫ్గానిస్తాన్ జాతీయ టీవీ చానల్ ఒక హెచ్చరికతో కూడిన ఉపదేశాలు ప్రసారం చేసింది. ఇస్లాం శత్రువులకు లొంగిపోకుండా ఉండాలని దేశ యువతను హెచ్చరించింది.
అఫ్గానిస్తాన్ మీద పట్టు సాధించిన తర్వాత ఈ చానల్ తాలిబాన్ల నియంత్రణలోకి వచ్చింది.
శుక్రవారం నమాజు తర్వాత జాతీయ టీవీలో ఒక మౌల్వీ ప్రసంగిస్తున్నారు. ఉపదేశాలు ఇస్తున్నారు.
"ఈ దేశంపై మీకు హక్కు ఉంది. దేశం మన తల్లి లాంటిది. మనకు జన్మనిచ్చే తల్లి ఒకరైతే, మతం మనకు మరో తల్లి లాంటిది" అని బోధిస్తున్నారు.
దేశాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్న తర్వాత మొదటి శుక్రవారమే జాతీయ టీవీలో నమాజు సమయంలో ఉపదేశాలు ఇవ్వాలని మౌల్వీలకు తాలిబాన్ ఆదేశాలు జారీ చేశారు.
జాతి నిర్మాణానికి అఫ్గాన్ ప్రజలందరూ ఏకమయ్యేలా వారిలో స్ఫూర్తి నింపాలని, శత్రువుల ప్రచారాలను తిప్పి కొట్టాలని వారికి సూచించారు.
దేశ యువతకు మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, దేశ మీడియాపై ఉందని మతపెద్దలు ఆ సమయంలో చెబుతుంటారు.
ఒకవైపు ప్రభుత్వ టీవీ చానల్లో మతపెద్దల ఉపదేశాలు ప్రసారం అవుతుంటే, మరోవైపు టోలో న్యూస్, అరియానా న్యూస్ టీవీ, వన్ టీవీ లాంటి ప్రైవేటు టీవీ చానళ్లు తమ మామూలు న్యూస్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తున్నాయి.
- 'తాలిబాన్ చేతికి చిక్కడం కంటే చచ్చిపోవడం మేలు’- అఫ్గాన్ అమ్మాయి కన్నీటి కథ
- అఫ్గానిస్తాన్: భారత్కు వచ్చిన వారిలో పాలు తాగే శిశువు, వృద్ధులు కూడా ఉన్నారు - ఫోటోఫీచర్

పంజ్షీర్ మీద దాడికి బయల్దేరిన వందలాది తాలిబాన్
వందలాది ఫైటర్లు పంజ్షీర్ లోయ వైపు బయల్దేరారని తాలిబాన్ నేతలు ఆదివారం రాత్రి చెప్పారు.
ఇప్పటికీ తాలిబాన్ నియంత్రణలోకి రాని అఫ్గానిస్తాన్లోని ప్రాంతాల్లో పంజ్షీర్ ఒకటి.
కాబుల్కు ఉత్తరంగా ఉన్న పంజ్షీర్ను తాలిబాన్ ప్రత్యర్థులకు కంచుకోటగా భావిస్తారు. అది ఇప్పుడు ముజాహిదీన్ మాజీ కమాండర్ అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్ నియంత్రణలో ఉంది.
అమెరికాలో అల్ ఖైదా 9/11 దాడులకు రెండు రోజుల ముందు అహ్మద్ షా మసూద్ హత్యకు గురయ్యారు.
https://twitter.com/alemara_ar/status/1429464431960936454
"పంజ్షీర్ ప్రాంతాన్ని శాంతియుతంగా తమకు అప్పగించడానికి స్థానిక అధికారులు ఒప్పుకోలేదు. అందుకే వందలాది ఇస్లామీ ఎమిరేట్ ముజాహిదీన్లు దానిని తమ నియంత్రణలోకి తెచ్చుకోడానికి ముందుకు వెళ్తున్నారు" అని తాలిబాన్ తమ ట్విటర్ హాండిల్లో చెప్పింది.
తాలిబాన్ కాబుల్ ఆక్రమణ తర్వాత వేలమంది పంజ్షీర్ ప్రాంతంవైపు వెళ్లిపోయారు.
తాలిబాన్ ఫైటర్లతో యుద్ధం కోసం తాము సుమారు 9 వేల మందిని సిద్ధం చేసినట్లు మసూద్ నాయకత్వంలోని దళాలు చెబుతున్నాయి.
అఫ్గానిస్తాన్లోని ఎన్నో ప్రాంతాల నుంచి పారిపోయిన ప్రభుత్వ భద్రతా బలగాలు పంజ్షీర్ చేరుకున్నాయని కూడా మసూద్ సౌదీ అరేబియా మీడియా చానల్ అల్-అరబియాకు చెప్పారు.
అఫ్గానిస్తాన్ రక్షణ కోసం తాము సిద్ధంగా ఉన్నామని, రక్తపాతం జరగవచ్చని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని 'అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications