Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Baloch Freedom Struggle: బలూచిస్తాన్ పాకిస్థాన్ నుంచి విడిపోతుందా?

Baloch Freedom Struggle: బలూచిస్తాన్‌లో రైలు హైజాక్ ఘటన తర్వాత బలూచ్‌ల స్వేచ్ఛ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. బలూచ్‌లు స్వాతంత్ర్యం సాధించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ కూడా ప్రమాదకరమైన ప్రతీకారం తీర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వందలాది మంది చనిపోవడం ఖాయం. పాకిస్థాన్ సైన్యం గతంలో ఇలాగే చేసినట్లు సమాచారం. పాక్ సైన్యం తన సొంత ప్రజలపై బాంబులు వేయడానికి కూడా వెనకాడదు. బలూచ్ తిరుగాబాటు కీలక దశలో రైలు హైజాక్ జరిగింది. బలూచ్ ప్రజలు చాలా కాలంగా తమ ప్రత్యేక గుర్తింపు, హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ హైజాక్ బలూచిస్తాన్ లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది.

అయితే ఆపరేషన్ ముగిసిందని, 155 మంది బందీలను విడిపించామని పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. 27 మంది బలూచ్ తిరుగుబాటుదారులు మరణించారని సైన్యం పేర్కొంది. కానీ పాకిస్థాన్ సైన్యం అబద్ధాలు చెబుతోందని బలూచ్ తిరుగుబాటుదారులు ఆరోపించారు. 154 మంది సైనికులు ఇప్పటికీ బందీలుగా ఉన్నారని, వారందరూ తమ అదుపులో ఉన్నారని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. కాబట్టి పాకిస్థాన్ సైన్యం తన ముఖాన్ని కాపాడుకోవడానికి అబద్ధం చెబుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ లో దాదాపు 750 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారని పాకిస్థాన్ రైల్వే అధికారులు తెలిపారు. కానీ రైలు దాదాపు 450 మందితో క్వెట్టా నుంచి బయలుదేరింది. అదే రైలులో 200 మందికి పైగా భద్రతా సిబ్బంది కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

కీలక దశకు చేరుకున్న బలూచ్ ల స్వాతంత్య్ర పోరాటం
1948 నుంచి బలూచిస్తాన్ నాలుగు సార్లు తిరుగుబాట్లు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం బలూచిస్తాన్ అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటోంది. ఈ సమయం బలూచిస్తాన్ చరిత్రలో, పంజాబీ ఆధిపత్య పాకిస్థాన్ పాలనతో దాని యుద్ధంలో ఒక కీలక ఘట్టం కావచ్చని తెలుస్తోంది. మరో వైపు ఈ రైలు హైజాక్ ఘటన, పాకిస్థాన్ సైన్యం నిఘా వైఫల్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. దీంతో పాటు రైలు హైజాక్ ఘటన బలూచ్ తిరుగుబాటుదారుల నిఘా వ్యవస్థ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది.

బలూచిస్తాన్ లోని బోలాన్ జిల్లాలో కొనసాగుతున్న రైలు హైజాక్ ఆపరేషన్ నేపథ్యంలో.. పాక్ సైన్యం డ్రోన్లు లేదా ఆయుధాలను ఉపయోగిస్తే 10 మంది పాకిస్తానీ బందీలను వెంటనే చంపేస్తామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ సైన్యాన్ని బెదిరించింది. దీనితో పాటు బలూచ్ తిరుగుబాటుదారులు బందీలలో ఆత్మాహుతి బాంబర్లను కూడా ఉంచారు. కాబట్టి ఆపరేషన్ ముగిసిందని, బందీలందరినీ విడుదల చేశామని పాకిస్థాన్ సైన్యం చేస్తున్న వాదనను నమ్మడం కష్టం. పాకిస్థాన్ సైన్యం బాధ్యతారహితమైన, మూర్ఖపు సైనిక దురాక్రమణ చేస్తోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జీనత్ బలోచ్ ఆరోపించారు. హైజాత్ చేయబడిన జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు సమీపంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ యోధుల నియంత్రణలో ఉన్న స్థానాలపై డ్రోన్ దాడులు, ఫిరంగి దాడులను నిర్వహించారని ఆయన ఆరోపించారు.

Baloch Freedom Struggle Will Balochistan Break Free from Pakistan

బలూచ్ లు పాకిస్థాన్ సైన్యాన్ని బయటపెట్టారా?
ఈ దాడులు పాకిస్థాన్ ఖైదీల మార్పిడికి సంబంధించి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోలేదని విషయాన్ని రుజువు చేస్తున్నాయని జీనత్ బలోచ్ అన్నారు. అధికారులు యుద్ధం కోసం పిచ్చి, మొండితనంతో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు. అద్భుతమై వ్యూహం, పూర్తి నియంత్రణ కారణంగా ఏ బలూచ్ యోధుడూ కూడా మరణించలేదని ఆయన పేర్కొన్నారు. బలూచ్ యోధులపై పాక్ సైన్యం దాడికి దిగితే.. 10 మంది బందీలను చంపవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

జాఫర్ ఎక్స్ ప్రెస్ పై ఉగ్రవాదులు జరిపిన భయంకరమైన దాడి బలూచిస్తాన్ లో ప్రభుత్వ ప్రభావం తగ్గిపోవడాన్ని స్పష్టంగా గుర్తు చేస్తోందని డాన్ తన సంపాదకీయంలో పేర్కొంది. ఉగ్రవాద నిరోధక చర్య ముగిసిందని పాక్ సైన్యం ధ్రువీకరించినా.. వందలాది మంది ప్రయాణికులు , భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న రైలును నిర్జనం ప్రాంతంలో ఆపి హైజాక్ చేయడంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ విజయం సాధించిందనే విషయాన్ని తిరస్కరించలేమని డాన్ రాసుకొచ్చింది. బలూచిస్థాన్ లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని డాన్ సంపాదకీయం పేర్కొంది. అక్కడికి ప్రజల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి.

"బెలూచిస్థాన్ లో శాశ్వత శాంతిని సాధించడం సాధ్యమైతేనే సుపరిపాలన సాధ్యమవుతుంది. అలా జరిగితేనే బలూచిస్థాన్ లోని ప్రజలు దాని ఖనిజ సంపద, ఇతర వనరులలో వాటా పొందుతారని.. నివాసితుల నిజమైన ప్రతినిధులు ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి అనుమతించబడతారని డాన్ పత్రిక పేర్కొంది. బలూచిస్థాన్ ను కాపాడటానికి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల రైలు హైజాక్ తర్వాత బలూచ్‌లకు, పాకిస్థాన్ ప్రభుత్వానికి మధ్య నిర్ణయాత్మక యుద్ధం ప్రారంభమైందని ఇప్పుడు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ పోరాటంలో రక్తపు నదులు ప్రవహించడం ఖాయం.. ఎవరు గెలుస్తారో కాలమే నిర్ణయిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+