అతిపెద్ద కార్చిచ్చు దెబ్బకు.. పట్టణాలకు పట్టణాలు ఠా
ఇప్పటికే కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా సంభవించిన కార్చిచ్చు చిలీ ప్రాంత ప్రజానీకాన్ని వణికిస్తోంది. పెనుగాలులు తోడవడంతో దావానలంలా మారి పట్టణాలకు పట్టణాలను బొగ్గు బొగ్గు చేసేస్తోంది.
చిలీ: ఆధునిక చరిత్రలోనే ఇదో అతిపెద్ద కార్చిచ్చు. అనూహ్యంగా రేగిన ఈ కార్చిచ్చు ఎంతకీ అదుపులోకి రాకపోగా.. విసురుగా వీస్తున్న పెనుగాలులు తోడవడంతో దావానలంలా మారి పట్టణాలకు పట్టణాలను బొగ్గు బొగ్గు చేసేస్తోంది.
ఈ కార్చిచ్చు దెబ్బకు మధ్య చిలీ ప్రాంతాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. ఆ ప్రాంత ప్రజానీకం బెంబేలెత్తిపోతోంది. ఇన్నాళ్ళూ వారు నివశించిన ఆ ప్రాంతాలను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోతున్నారు.

శాంటా ఓల్గా పట్టణంలో వందలు వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు తప్ప వారి వద్ద ఏం లేకుండా పోయాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. విపరీతంగా వస్తున్న వేడి గాలులు, చుట్టేసిన నల్లటి పొగ కారణంగా సమీప ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో రష్యా కూడా రంగంలోకి దిగింది. టన్నుల కొద్దీ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన సూపర్ ట్యాంకర్ విమానాన్ని పంపించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా సంభవించిన కార్చిచ్చు చిలీ ప్రాంత ప్రజానీకాన్ని వణికిస్తోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications