విరుచుకుపడ్డ డబుల్ భూకంపం! సునామీ భయం, 47 మంది మృతి

ప్రకృతి ఇండోనేషియాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొద్ది గంటల వ్యవధిలోనే వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ ద్విపకల్పాన్ని అతలాకుతలం చేశాయి. శనివారం తెల్లవారుజామున ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన 7.7 తీవ్రత కలిగిన వినాశకర భూకంపం సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే, పశ్చిమ సుమత్రా ప్రాంతంలో మరోసారి 6.9 తీవ్రతతో భూమి తీవ్రంగా ప్రకంపించింది. ఈ దెబ్బకు కనీసం 38 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

శనివారం తెల్లవారుజామున సుమారు 3:28 గంటల సమయంలో ఫ్లోరెస్ తీర ప్రాంతంలో సంభవించిన తొలి భూకంపం ధాటికి అనేక గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 47 మంది చనిపోగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. శతాబ్దాలలోనే అతిపెద్ద ప్రకంపనగా భావిస్తున్న ఈ ఘటనతో సుమారు 2,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలేసి తాత్కాలిక పునరావాస కేంద్రాలకు పరుగులు తీశారు. తీరప్రాంత ప్రజలను సునామీ భయం తీవ్రంగా వేధించింది.

Double Earthquake Hits Indonesia 6 9 Magnitude Quake Rocks Western Sumatra as Death Toll Rises to 47

కొండచరియలు విరిగిపడి నిలిచిన సహాయక చర్యలు!

భూకంప ధాటికి పలు ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థలు తెగిపోయాయి. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న నాగేకియో ప్రాంతానికి వెళ్లే రహదారులు మట్టిదిబ్బలతో మూసుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొండచరియల కింద చిక్కుకున్న ఇద్దరు గ్రామస్తులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు.

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!

పశ్చిమ సుమత్రాలో మరో భారీ ప్రకంపన!

తొలి ప్రమాదం నుంచి కోలుకోకముందే, శనివారం ఆలస్యంగా పశ్చిమ సుమత్రా పరిధిలోని పెమాటాంగ్ సియంతార్ సమీపంలో 183 కిలోమీటర్ల లోతున 6.9 తీవ్రతతో రెండో భూకంపం సంభవించిందని యూఎస్ జీయోలాజికల్ సర్వే ధృవీకరించింది. అయితే ఈ రెండో భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు ఏవీ జారీ కానప్పటికీ, వరుస భూప్రకంపనలతో భయపడిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోనే రాత్రంతా జాగారం చేశారు.

పాతికేళ్ల తర్వాత భయంకరమైన విపత్తు! 164 మంది బలి
పాతికేళ్ల తర్వాత భయంకరమైన విపత్తు! 164 మంది బలి

కళ్లముందే విరిగిపడ్డ భవనాలు.. క్షణాల్లో మారిన దృశ్యం!

భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు కళ్లముందే కుప్పకూలిపోయిన దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇళ్లు కదిలిపోతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైకి పరుగులు తీశామని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రస్తుతం పటిష్టమైన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+