Drones Attack On Moscow: మాస్కోపై డ్రోన్ల దాడులు.. స్పందించిన ఉక్రెయిన్..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ పై దాడులతో విరుచుకుపడింది. తాజాగా రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులు జరిగాయి. దాడులు జరిగినట్లు రష్యా అధికారులు కూడా అంగీకరించారు. డ్రోన్లు మాస్కోలోని అనేక భవనాలను ఢీకొట్టడంతో స్వల్ప నష్టం జరిగిందని మాస్కో మేయర్ మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. నగరంలోని అన్ని అత్యవసర సేవలు సంఘటనలు జరిగిన ప్రదేశంలో ఉన్నాయని చెప్పారు.
డ్రోన్ దాడులతో ప్రొఫ్సోయుజ్నాయ వీధిలోని భవనంలోని కొంతమంది నివాసితులను ఖాళీ చేయిస్తున్నట్లు రష్యా RIA రాష్ట్ర వార్తా సంస్థ తెలిపింది ఆండ్రీ వోరోబయోవ్, మాస్కో ప్రాంత గవర్నర్ మాస్కోకు చేరుకున్నారు. సైన్యం డ్రోన్లను పేల్చివేశాయి. అయితే ఈ డ్రోన్లను ఎవరు ప్రయోగించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మాస్కో శివార్లలో, దాని సమీప ప్రాంతంలో నాలుగు నుంచి 10 డ్రోన్లను నేలమట్టం చేశారు.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్ను "ఉగ్రవాద దాడి"గా ఆరోపించింది, ఇది మాస్కోను లక్ష్యంగా చేసుకున్న ఎనిమిది ఉక్రేనియన్ డ్రోన్లను అడ్డగించిందని పేర్కొంది. "ఈ ఉదయం కైవ్ పాలన మాస్కో నగరంలోని లక్ష్యాలపై డ్రోన్లతో తీవ్రవాద దాడి చేసింది. ఈ దాడిలో ఎనిమిది డ్రోన్లను ఉపయోగించారు. శత్రు డ్రోన్లన్నింటినీ కూల్చివేశారు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మాస్కో నగర నడిబొడ్డున, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా కీలక పరిపాలనా యంత్రాంగమంతా కార్యకలాపాలు నిర్వహించే క్రెమ్లిన్ భవనాలపై మే తొలివారంలో రెండు డ్రోన్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజా డ్రోన్ దాడులపై మాస్కో గవర్నర్ ఆండ్రీ స్పందించారు. పలు డ్రోన్లను కూల్చివేశామని చెప్పారు. కొంత మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మాస్కోలో డ్రోన్ల దాడులపై ఉక్రెయిన్ స్పందించింది. ఈ దాడులకు తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే మాస్కోపై దాడులు జరగడంపై హర్షం వ్యక్తం చేసింది












Click it and Unblock the Notifications