పాకిస్థాన్ను 3 ఎలుకలు దోచాయి! నాపై కుట్రలు: ఇమ్రాన్ ఖాన్, అవిశ్వాసానికి ముందు కీలక స్పీచ్
ఇస్లామాబాద్: అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనే ముందు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లో భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు స్వార్థపరులైన రాజకీయ నాయకులు, సైన్యాధికారులు కలిసి తనను పదవి నుంచి తప్పించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. పాక్ అసెంబ్లీలో సోమవారం ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న విషయం తెలిసిందే.
ర్యాలీని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. "నేను 25 సంవత్సరాల క్రితం ఒక విషయం కోసం రాజకీయాల్లోకి వచ్చాను, అది పాకిస్తాన్ దృక్పథాన్ని అనుసరిస్తోంది" అని అన్నారు. దేశం యూనివర్సల్ హెల్త్ కవరేజీని ఖాన్ ప్రశంసించారు. ఇళ్లను నిర్మించుకోవడానికి ప్రజలకు ఎటువంటి వడ్డీ రుణాలు విధించబడకుండా తన ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఇంధన ధరలు తగ్గాయని, ద్రవ్యోల్బణంపై పోరుకు చర్యలు తీసుకున్నామని, పన్ను సొమ్ము మొత్తాన్ని పాకిస్థాన్ ప్రజల కోసం వినియోగించామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

"ధనవంతుల నుంచి పన్ను తీసుకొని పేదలకు ఇస్తున్నాం." అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. వైట్కాలర్ నేరగాళ్ల వల్లే పాకిస్థాన్ పేదరికంలో ఉందని ఇస్లామాబాద్ ర్యాలీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆఫ్ షోర్ బ్యాంక్ ఖాతాలు, లండన్ ఆస్తుల గురించి స్పష్టంగా ప్రస్తావిస్తూ, "గత 30 సంవత్సరాల నుంచి దేశాన్ని మూడు ఎలుకలు దోచుకుంటున్నాయి" అని విమర్శలు గుప్పించారు.
పాకిస్థాన్ అభివృద్ధి కోసం తాను అన్ని విధాలుగా కృషి చేశానని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తనను పదవి నుంచి తప్పించేందుకు స్వార్థ రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. తన పార్టీ నేతలను వారు ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విదేశీ శక్తులు కూడా ప్రభుత్వ అస్థిరతకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications