Rohith Sharma: అమెరికాలో దుకాణం తెరిచిన రోహిత్ శర్మ..!
రోహిత్ శర్మ భారత క్రికెట్ లో అంచలంచలుగా ఎదిగాడు. భారత జట్టు కెప్టెన్ అయ్యారు. రోహిత్ శర్మ పేరిట అనే రికార్డులు ఉన్నాయి. భారత్ తరఫున, ప్రపంచంలోనే అత్యధిక డబుల్ సెంచరీ చేసిన ఆటగాడి రోహిత్ శర్మ నిలిచారు. రోహిత్ శర్మ 52 టెస్ట్ మ్యాచుల్లోని 81 ఇన్నింగ్స్ ల్లో 3677 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 16 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.
244 వన్డేల్లో 9837 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 148 టీ20 మ్యాచుల్లో 3853 పరుగులు చేయగా.. అందులో 4 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో 243 మ్యాచుల్లో 6211 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ 2007లో వన్డే, టీ20 మ్యాచుల్లో అరంగేట్రం చేశాడు.

టెస్టుల్లో మాత్రం 2013లో అరంగేట్రం చేశాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సాధించిన టీం సభ్యుల్లో రోహిత్ శర్మ ఒకడు. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ సౌతాఫ్రికా పై ఆఫ్ సెంచరీ సాధించాడు. వెస్టిండిస్ పర్యటన తర్వాత రోహిత్ శర్మ అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్ లో రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. వెస్టిండీస్ టీ20 సిరిస్ కు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో అనతు అమెరికాలో బిజీగా గడుపుతున్నాడు.
ఇప్పటికే రోహిత్ శర్మ తన మొదటి క్రికెట్ అకాడమీని భారత్ లో ప్రారంభించాడు. ఇప్పుడో రెండో అకాడమీని యూఎస్ లోనికాలిఫోర్నియాలో స్థాపించాడు. భారత జట్టు త్వరలో ఆసియా కప్ లో పాల్గొననుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ లో ఆడనుంది.












Click it and Unblock the Notifications