గాజాలో హాస్పిటల్ ను పేల్చేసిన ఇజ్రాయిల్.. వీడియో వైరల్
గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ భీకర దాడులను ఉద్ధృతం చేసింది. తాజాగా గాజాలోని ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి చేపట్టింది. ఈ దాడిలో నలుగురు జర్నలిస్టులతో పాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వివరాలను గాజాలోని హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వైపు కాల్పుల విరమణకు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు గాజాలో వైమానిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం తొలి అడుగులు వేసినట్లు చెప్పుకొచ్చారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా ప్రాంతం అట్టుడుకిపోతోంది. తాజాగా దక్షిణ గాజాలోని నసేర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రి భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది. ఈ దాడుల్లో నలుగురు జర్నలిస్టులతోపాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు దక్షిణ గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అల్ జజీరా, రాయిటర్స్ కు చెందిన జర్నలిస్టులు ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఇక తాజా దాడిలో ఆస్పత్రి భవనం వద్ద పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇజ్రాయెల్ సైన్యం గత 22 నెలలుగా నసేర్ ఆస్పత్రిపై దాడులు చేస్తూనే ఉంది. ఈ ఆస్పత్రిలో హమాస్ మిలిటెంట్స్ ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. తాము హమాస్ ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. నసేర్ ఆస్పత్రిలో హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వాదిస్తోంది. వాటినే తాము టార్గెట్ చేసినట్లు స్పష్టం చేసింది. జూన్ లోనూ ఇదే ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందగా 10 మందికిపైగా గాయపడ్డారు.
Israel HITS roof of HOSPITAL in Khan Younis — journalist killed
— RT (@RT_com) August 25, 2025
Reception building of the Nasser Medical Complex was struck by an Israeli warplane, killing a journalist Hussam Al-Masri
Total number of journalists killed since October 7 has risen to 241 pic.twitter.com/rY4lLLIoB1
ఇక గాజా ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం మొదలైనప్పటి నుంచి 62, 686 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వీరిలో సగానికి పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. అయితే ఈ వివరాలను ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. ఇక ఇజ్రాయెల్ సైన్యం గాజాను స్వాధీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాలు తీర్మానించాయి. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ప్రకటన చేశాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఇజ్రాయెల్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.
-
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications