జీవితకాల అనుభవం, స్పేస్ యాత్రపై బ్రాన్సన్.. తిరిగొచ్చిన వ్యోమ నౌక
వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయింది. వెదర్ వల్ల 'యూనిటీ 22' అంతరిక్ష నౌక ప్రయాణం నిర్ణీత సమయానికి 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి క్షేమంగా తిరిగి భూమికి చేరుకుంది. ఈ స్పేస్షిప్లో తెలుగుతేజం శిరీష ప్రయాణించారు. భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష రికార్డు సృష్టించారు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కంటే ముందుగానే రిచర్డ్ బ్రాన్సన్ యాత్ర పూర్తి చేశారు. స్పేస్ టూరిజంలో సరికొత్త సంచలనంగా మారిన ఈ యాత్రతో గంటన్నరలోనే రోదసీ యాత్ర చేయొచ్చని బ్రాన్సన్ బృందం నిరూపించింది. వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, మిషన్ స్పెషలిస్టులు వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్స్ట్రక్టర్ బెత్ మోజెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కోలిన్ బెన్నెట్, కంపెనీలో గవర్నమెంట్ అఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన గుంటూరు అమ్మాయి శిరీష బండ్ల ఇందులో ప్రయాణించారు. ఈ పర్యటన 90 నిమిషాల్లో ముగిసింది.
Recommended Video
స్పేస్ టూర్ కోసం గత 17 ఏళ్లుగా పరిశోధనలు చేపట్టింది. ఇవాళ ఆ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇందులో తెలుగు అమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. తమ అనుభవాలను వారు పంచుకున్నారు.