హిందువులపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో మరో విధ్వంసం
Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్- హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో అట్టుడికిపోతోంది. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వస్తోన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి మాత్రం బ్రేకులు పడట్లేదు.
గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ బంగ్లాదేశ్లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి.

హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు. హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం, భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విగ్రహాలను పగులగొట్టడం, మంటల్లో పడేయడం, తగులబెట్టడం రోజువారీ కార్యక్రమంగా మారింది. మహ్మద్ యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండట్లేదు.
ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్లో మరో విధ్వంసం చోటు చేసుకుంది. ఆ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ స్మారక నివాసంపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. నిప్పంటించారు. స్వైరవిహారం చేశారు. ఈ ఘటనలో స్మారక నివాసం మొత్తం ధ్వంసమైంది. అక్కడి ఫర్నిచర్ బుగ్గిపాలైంది.
రాజధాని ఢాకాలోని దన్మొండి ఏరియా 32లో ఉంటుందీ బంగ్లా. ముజీబుర్ రెహ్మాన్ స్థాపించిన ఆవామీ లీగ్ పార్టీని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఆందోళనకారులు ఢాకాలో బుల్డోజర్ ర్యాలీ నిర్వహించారు. రాత్రి పొద్దుపోయేంత వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. ఆ తరువాత ఆందోళనకారులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఆందోళనకారులు ముజీబుర్ రెహ్మాన్ స్మారక నివాసంపై దూసుకెళ్లారు. వేల సంఖ్యలో ఉండటం వల్ల అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వచ్చింది. తొలుత ఆందోళనకారులు అన్ని వైపుల నుంచి బంగ్లాను చుట్టుముట్టారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు. విధ్వంసానికి పాల్పడ్డారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్లతో ఇంటిని తగులబెట్టారు.
దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీన ఆయన కూతురే. తండ్రి స్థాపించిన ఆవామీ లీగ్కు నాయకత్వాన్ని వహిస్తోన్నారు. ప్రభుత్వం కుప్పకూలేంత వరకూ ఈ పార్టీనే అధికారంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని నిషేధించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తోన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications