ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం: భారత్ కు పాకిస్థాన్ స్ట్రాంగ్ వార్నింగ్
పాకిస్థాన్ మరోసారి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. తమకు రావాల్సిన నీటిని ఒక్క చుక్కను కూడా భారత్ కు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. తమకు దక్కాల్సిన నీటిని నిలిపివేస్తే యుద్ధానికి సంకేతంగా తాము భావిస్తామని తెలిపింది. ఈమేరకు మరోసారి ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు భారత్ ను శత్రు దేశంగా ఆయన అభివర్ణించారు. భారత్ తమకు దక్కాల్సిన నీటిని నిలిపివేస్తుందని మండిపడ్డారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. సింధూ జలాల పంపిణీని రద్దు చేసింది.
అంతకు ముందు పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి భిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి ఆరు నదులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. పాకిస్థాన్ లోని ప్రతీ పౌరుడు భారత్ పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో భారత్ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగిస్తే, పాక్ యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదన్నారు.
మరోవైపు ఇటీవల అమెరికాలో ఏర్పాటు చేసిన బ్లాక్ టై డిన్నర్ లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాల్గొని భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు భారత్ నే కాదు.. సగం ప్రపంచాన్ని ధ్వంసం చేసే శక్తి ఉందని అన్నారు. అలాగే పాకిస్థాన్ కు నీరు వెళ్లకుండా సింధూ నది జలాలను భారత్ నిలిపివేయడంపై అసిమ్ మునీర్ మండిపడ్డారు. సింధూ నదిపై భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోందని.. ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు వేచి చూసి పూర్తయ్యాక 10 మిసైల్స్ తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

అయితే తాజాగా పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి జరిపిన ఈ దాడిలో 9 మంది పాకిస్థాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. బలూచిస్తాన్ లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
-
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ఇగో తగ్గని ప్లేయర్లు.. దిక్కులేని బోర్డు.. పాక్ క్రికెట్ను ముంచేది వీళ్లేనా? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications