ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమాన్ని మరిచిన ఆ పార్టీలు.. జగదీశ్ ఫైర్
నల్గొండ : ఉమ్మడి పాలనలో తెలంగాణ వివక్షకు గురైందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. కానీ వారికి సంక్షేమం అంటే పట్టదని విమర్శించారు. ఏనాడు ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేస్తారని పేర్కొన్నారు.
ఏం చేశారు ..?
ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్, టీడీపీలేనని గుర్తుచేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. కానీ వారు శ్రీరంగ నీతులు వల్లించారే తప్ప అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లా వివక్షకు గురైందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ నీటితో ప్రజలు ఇబ్బందులు పడ్డారని .. కానీ కాంగ్రెస్ పాలకులు సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమమే పరామవధిగా పనిచేస్తుందన్నారుు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు ఇచ్చి ప్రజల గొంతు తడుపుతున్నామని తెలిపారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని స్పష్టంచేశారు. అన్నివర్గాలు మేలు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications