ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానాడు కాదు మాయనాడు.. మంత్రి సురేష్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఒంగోలులో టీడీపీ మహానాడు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మహానాడుని అధికార పక్షం నేతలు టార్గెట్ చేశారు. మహానాడుతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అది మహానాడు కాదు మహా ప్రస్థానం అని ఒకరంటే, అది మహానాడు కాదు మాయనాడు అని మరొకరు అన్నారు. టీడీపీ నిర్వహించేది మహానాడు కాదు మాయనాడు అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

ఎన్టీఆర్‌ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు. వైసీపీ గాలికి టీడీపీ గత ఎన్నికల్లో కొట్టుకుపోయిందని, వచ్చే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతుందని మంత్రి సురేశ్ అన్నారు. అచ్చెన్నాయుడు అవినీతి చేశారని, అధికార దుర్వినియోగం చేశారని, అందుకే కేసులు నమోదు చేశారని వివరించారు.

minister suresh angry on tdp

టీడీపీలో ఉన్నదంతా దొంగలే అని, గత ఐదేళ్లు దోచుకుతిన్నారని మంత్రి సురేశ్ ఆరోపించారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు దొంగలు కాబట్టే ప్రజలు వాళ్లను ఇంటికి పంపించారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలకు ఆయుధాలు ఇచ్చి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ చేశారు. ఇదీ అందరికీ తెలుసు అని చెప్పారు.

English summary
andhra pradesh minister suresh angry on tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X