హైదరాబాద్ నానక్రాంగూడలో భారీ పేలుళ్లు: నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని నానక్రాంగూడలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఫోనెక్స్ భవనంలో ఈ పేలుళ్లు జరగడంతో దగ్గరలో ఉన్న లారీ, పక్క భవనం కూడా దెబ్బతిన్నాయి. మరో నాలుగు కార్లు కూడా ధ్వంసమయ్యాయి.
గాయపడిన ఇద్దరూ పక్క భవనంలో ఉన్నట్లు తెలిసింది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని వారి అదుపులోకి తీసుకున్నారు. అటువైపుగా ఎవరినీ అనుమతించడం లేదు.

మరిన్ని పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో జిలిటెన్ స్టిక్స్ పేల్చడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications