జీవితంపై విరక్తి: ఎస్సారెస్పీ కాలువలో దూకి వివాహిత ఆత్మహత్య
వరంగల్: ఎస్సారెస్పీ కాలువలో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రగట్టు గుట్ట ప్రాంతానికి చెందిన సాయబోయిన రమాదేవి(45) గత కొన్ని రోజు లనుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యం తీసుకున్నప్పికీ వ్యాధి నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఎస్సారెస్పీ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

అయితే ఆమె మృతదేహాన్ని గుండ్లసింగారం సమీపంలో పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతురాలి భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ దేవేందర్రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications