అవినీతి చేప, కళ్లు తిరిగే ఆస్తులు: డ్రైవర్లకే ఉంటాయి మాకుండవా అని ప్రశ్న (పిక్చ)
హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) అధికారి ఇంట్లో బుధవారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సర్కిల్ 18లో సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తున్న మహేష్కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది.
నగరంలోని పలుచోట్ల ఆరు ఆరు టీంలు సోదాలు నిర్వహించాయి. అతని వద్ద ఆరు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అతని ఇంట్లో, బంధువులు, స్నేహితులు ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్, అతని భార్య స్పందించారు. మహేష్ మాట్లాడుతూ.. తమకు తమ తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అలాగే తాను, తన భార్య ఇద్దరం కూడా ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పారు. అందుకే తమ వద్ద ఆస్తులు ఉన్నాయన్నారు.
మీరు చెప్పినట్లుగా తమ వద్ద ఆస్తులేమీ లేవన్నారు. ఆయన భార్య మాట్లాడుతూ.. తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని, కష్టపడి సంపాదించుకున్నామని చెప్పారు. తాను ఇరవై ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పారు. కష్టపడి సంపాదించుకున్నామన్నారు.
ఏసీబీ అధికారులు రావడం గురించి తనకేం తెలియదని, వారినే అడగాలన్నారు. ఇదంతా తమ అత్తగారు, తమ తల్లిగారు, తమ కష్టార్జితమని చెప్పారు. ఓ ఆటో డ్రైవర్కే పెద్ద ఇల్లు, ఏసీ, టీవీ ఉంటుందని, అలాంటప్పుడు తమకు ఫ్రిజ్, కూలర్ ఉండదా అన్నారు.
మీరు చెప్పినట్లుగా తమ వద్ద ఆస్తులేమీ లేవన్నారు. ఆయన భార్య మాట్లాడుతూ.. తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని, కష్టపడి సంపాదించుకున్నామని చెప్పారు. తాను ఇరవై ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పారు. కష్టపడి సంపాదించుకున్నామన్నారు.
ఏసీబీ అధికారులు రావడం గురించి తనకేం తెలియదని, వారినే అడగాలన్నారు. ఇదంతా తమ అత్తగారు, తమ తల్లిగారు, తమ కష్టార్జితమని చెప్పారు. ఓ ఆటో డ్రైవర్కే పెద్ద ఇల్లు, ఏసీ, టీవీ ఉంటుందని, అలాంటప్పుడు తమకు ఫ్రిజ్, కూలర్ ఉండదా అన్నారు.
అవినీతి చేప
అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన బల్దియా అధికారి మహేశ్ ఏసీబీ వలకు చిక్కారు. బుధవారం రంగారెడ్డి డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో మహేష్ ఇల్లు, కార్యాలయం సహా అతడి బంధువుల ఇళ్లలో మొత్తం ఆరుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
అవినీతి చేప
అక్రమాస్తులను గుర్తించి వాటి విలువను రూ.3.1కోట్లుగా నిర్ధరించారు. మార్కెట్ విలువ రూ.6కోట్లు ఉంటుందని అధికారులు వివరించారు.
అవినీతి చేప
సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ 18 సర్కిల్ కార్యాలయంలో మహేష్ పట్టణ ప్రణాళిక విభాగంలో సెక్షన్ అధికారిగా పని చేస్తున్నారు.
అవినీతి చేప
1987లో మూడో తరగతి ఉద్యోగిగా చేరిన ఆయన పదోన్నతులతో ప్రస్తుత స్థాయికి చేరారు. అక్రమార్జన పరంగానూ అదే స్థాయిలో ఎదిగారనే ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి చేప
ఇందుకు సంబంధించిన పక్కా సమాచారంతో అనిశా అధికారులు కొన్ని నెలలుగా అతని కార్యకలాపాలపై నిఘా పెట్టారు.
అవినీతి చేప
బుధవారం ఉదయం ఆరింటికి డీఎస్పీ ప్రభాకర్, ముగ్గురు ఇన్స్పెక్టర్లతో మల్కాజిగిరి సైనిక్నగర్లోని మహేష్ ఇంటికి చేరుకున్నారు. అతణ్ని అదుపులోకి తీసుకుని స్థిరచరాస్థులను లెక్కించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.
అవినీతి చేప
ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్, అతని భార్య స్పందించారు. మహేష్ మాట్లాడుతూ.. తమకు తమ తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయని చెప్పారు.
అవినీతి చేప
అలాగే తాను, తన భార్య ఇద్దరం కూడా ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పారు. అందుకే తమ వద్ద ఆస్తులు ఉన్నాయన్నారు.
అవినీతి చేప
మీరు చెప్పినట్లుగా తమ వద్ద ఆస్తులేమీ లేవన్నారు. ఆయన భార్య మాట్లాడుతూ.. తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని, కష్టపడి సంపాదించుకున్నామని చెప్పారు. తాను ఇరవై ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పారు. కష్టపడి సంపాదించుకున్నామన్నారు.