చంద్రబాబుకు మరో షాక్: తెరాసలోకి నారాయణపేట ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ మీద షాక్ తగులుతోంది. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ బుధవారం రాత్రి తెరాసలో చేరగా కొన్ని గంటల వ్యవధిలోనే మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కారెక్కుతున్నట్టు ప్రకటించారు.
గురువారం రాత్రి తెలంగాణ మంత్రులతో భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో ఫోన్లో మాట్లాడానని, ఢిల్లీ పర్యటననుంచి ఆయన తిరిగిరాగానే అధికారికంగా పార్టీలో చేరుతానని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి ఉనికి లేకుండా పోయిందన్నారు.

కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అందుకే పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తనకు నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమన్నారు.
ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్ తెరాసలో చేరిన తర్వాత టిడిపి నేతలకు భరోసా ఇవ్వడానికి చంద్రబాబు గురువారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సమావేశం నిర్వహించిన నేపథ్యంలోనే రాజేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు చెప్పడం గమనార్హం.
రాజేందర్రెడ్డి చేరికతో టీడీపీనుంచి మొత్తం 10 మంది ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో చేరినైట్లెంది. దీనితో టీడీపీ ఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనమయ్యేందుకు మార్గం సుగమమైంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications