ఆటోలో వచ్చాడని ఎమ్మెల్యేకు చేదు అనుభవం
హైదరాబాద్: దర్భానికీ దర్జాకు మాత్రమే గుర్తింపు, గౌరవం ఉంటుందనే విషయం ఓ శాసనసభ్యుడి విషయంలోనూ రుజువైంది. ఆటోలో అతి సాధారణంగా హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఖమ్మం జిల్లా భద్రాచలం సిపిఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది.
ఆటోలో వచ్చిన ఎమ్మెల్యేను లోనికి అనుమతించలేదు. తాను ఎమ్మెల్యేనని చెప్తే కూడా వినకుండా గుర్తింపు కార్డు చూపించాలని అడిగారు. దాంతో ఆయన ఆటో దిగి లోనికి నడుచుకుంటూ వెళ్లారు. భద్రాచలం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను గుర్తించకపోవడంపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో వస్తే తప్ప గుర్తు పట్టరా అని ఆయన అడిగారు.

సచివాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో తనను తనిఖీ సిబ్బంది అవమానించారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయానికి తాను ఆటోలో వచ్చానని, ఎమ్మెల్యేనని చెబుతున్నా వినకుండా నన్ను ఆటో నుంచి దించారని ఆయన అన్నారు. కార్లలో మంది మార్బలంతో వచ్చే వారే ఎమ్మెల్యేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం మీడియా పాయింట్లో తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ ఇలాంటి పద్ధతులు మంచిది కాదని, ఈ వ్యవహారాన్ని స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications