బాలయ్య అభిమానులు ఏం చేస్తున్నారో తెలుసా?: మెచ్చుకోవాల్సిందే!
ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులు పలు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
హైదరాబాద్/విశాఖపట్నం: ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులు పలు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలకృష్ణ 101వ సినిమా 'పైసా వసూల్' విడుదల సందర్భంగా 101మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు తెలిపారు.
బాలకృష్ణ అభిమాన సంఘం రంగారెడ్డి జల్లా అధ్యక్షుడు ఎన్ఎస్ రాజు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన బాలకృష్ణ అభిమానుల పిల్లల కోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.

ఆదాయ, విద్యా సంబంధిత ధృవపత్రాల జిరాక్సులతో ఆగస్టు 10వ తేదీలోపు పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని చెప్పారు.
అర్హులైన 101 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి.. పైసావసూల్ సినిమా విడుదలయ్యే లోపు నిర్మాత ఆనందప్రసాద్ చేతుల మీదుగా అందజేస్తామని రాజు తెలిపారు. వివరాల కోసం ఫోన్ నెం. 9396699955 సంప్రదించాలని కోరారు. కాగా, ఏపీలో విశాఖపట్నంతోపాటు ఇతర జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతోంది.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications