కార్టూన్ ఛానల్ చూసి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న బాలుడు, మృతి
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కార్టూన్ ఛానల్ చూసిన ఓ చిన్నారి.. తనకు తాను నిప్పు పెట్టుకున్నాడు. ఈ దుర్ఘటనలో చిన్నారి మృతిచెందాడు.
హైదరాబాద్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కార్టూన్ ఛానల్ చూసిన ఓ చిన్నారి.. తనకు తాను నిప్పు పెట్టుకున్నాడు. ఈ దుర్ఘటనలో చిన్నారి మృతిచెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జియాగూడకు చెందిన 12ఏళ్ల జయదీప్ వెంకటాపురంలోని తాతయ్య దగ్గర ఉంటున్నాడు. శుక్రవారం టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తూ.. అందులోని బొమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం గమనించాడు. అయినా అవి హాయిగా.. నవ్వడం చూసి.. వెంటనే తనూ కూడా అలాగే చేయాలనుకున్నాడు.

ఇంట్లోని కిరోసిన్ డబ్బా తీసుకుని డాబాపైకి వెళ్లాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలంటుకుంటూ ఉంటే.. అమ్మమ్మా.. తాతయ్యా.. అంటూ గట్టిగా అవరడం మొదలుపెట్టాడు.
ఏమయ్యిందో ఏమోనని పైకి వెళ్లి చూసేసరికి ఒళ్లంతా కాలిపోతోంది. వెంటనే బంధువుల సాయంతో మంటలు ఆర్పి.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం శరీరం కాలిపోవటంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు జయదీప్ మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications