పుత్ర శోకం: నీటి గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి...
11 నెలల చిన్నారి ప్రమాదవ శాత్తు నీటిగుంతలో పడి మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీ నగర్లో జరిగింది. గాంధీనగర్కు చెందిన బోడా ప్రసాద్, అరుణ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు తన్మయశ్రీ వయసు రెండేళ్లు కాగా.. కుమారుడు తన్వీష్ వయసు 11 నెలలు. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తారు.
ప్రసాద్ ఉదయాన్నే మిర్చి బస్తాలు తొక్కే పనికి వెళ్లగా.. అరుణ ఇంటిపనిలో నిమగ్నమైంది. తన్వీష్ ఆడుకుంటూ ఆడుకుంటూ తమ ఇంటి సమీపంలో గల తాతయ్య బోడా బాలు ఇంటివైపు వెళ్లి.. ఆయన ఇంటి ఎదురుగా ఉన్న వృథానీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన గుంతలో పడి పోయాడు. అయితే అందులో నిల్వ ఉన్న నీటిలో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత కుమారుడు కనిపించడం లేదని తల్లి అరుణ చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా కనిపించకపోవడంతో.. అనుమానం వచ్చి గుంతలో చూడగా బాలుడు కనిపించాడు.

బాలుడని జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకుం టున్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెల విసేలా రోదించారు. 2019 జనవరిలో ప్రసాద్ సోదరుడు రవి కుమార్తె గౌతమి.. గాంధీనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇప్పటికీ ఆ సంఘటన నుంచి వారి కుటుంబం కోలుకోకముందే అదే కుటుంబంలో మరో విషాదం జరగిందని గ్రామస్తులు అంటున్నారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications