రెండో వివాహం చేసుకొన్న ఎస్ ఐ పై మొదటి భార్య ఫిర్యాదు
కరీంనగర్: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు. మొదటి భార్య ఉండగానే మరో మహిళను వివాహం చేసుకొన్న భర్త పై చర్య తీసుకోవాలని ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. సాధారణ వ్యక్తిపై ఈ మహిళ ఫిర్యాదు చేయలేదు. సాక్షాత్తు ఎస్ ఐ పైనే ఆమె పిర్యాదు చేసింది.
కరీంనగర్ పట్టణంలోని త్రీ టౌన్ లో ఎస్ ఐ గా రఫిక్ పనిచేస్తున్నాడు.ఆయనకు ఇదివరకే వివాహం జరిగింది.అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకొన్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది.ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.
వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకోవడంతో మొదటి భార్యే కాదు.. రెండో భార్య తండ్రి కూడ రఫిక్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.వివాహం జరిగిన విషయాన్ని రహాస్యంగా తన కూతురును మోసం చేశారని ఆయన ఫిర్యాదు చేశాడు,
చట్టాన్ని రక్షించాల్సిన భాద్యతల్లో ఉండి కూడ తానే చట్టాన్ని రక్షించకుండా తుంగలో తొక్కాడు ఆ పోలీస్ అధికారి.ఆయనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.