తెలంగాణ పోలీస్పై వివాదాస్పద వ్యాఖ్యలు: దిగ్విజయ్ సింగ్పై కేసు నమోదు
తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయపరమైన సలహాలు తీసుకున్న పోలీసులు, ఆ తర్వాత డిగ్గీపై కేసు నమోదు
హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయపరమైన సలహాలు తీసుకున్న పోలీసులు, ఆ తర్వాత డిగ్గీపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బంజారాహిల్స్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు డిగ్గీపై కేసు నమోదు చేశారు.

తెలంగాణ పోలీసులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లతో ముస్లిం యువకులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారంటూ దిగ్విజయ్ సింగ్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, తెలంగాణ పోలీసులు చేస్తున్న ఈ పనికి సీఎం కేసీఆర్ అనుమతి కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు.
డిగ్గీపై వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీ డీ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి, జాతీయ పార్టీలో కీలక వ్యక్తి ఉన్న ఓ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. ఆధారాలుంటే చూపాలని, అనవసరమైన ఆరోపణలు చేయొద్దని డీజీపీ అనురాగ్ శర్మ.. డిగ్గీకి సూచించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications