కలకలం: ల్యాండవుతూ పైకి.. మళ్లీ కిందికి, విమానంలోనే కేసీఆర్ ఫ్యామిలీ
తిరుపతిలో రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా అందర్నీ ఆందోళనకు గురి చేసింది. సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో మళ్లీ గాల్లోకి ఎగిరింది.
చిత్తూరు: తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా అందర్నీ ఆందోళనకు గురి చేసింది. సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో మళ్లీ గాల్లోకి ఎగిరింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మళ్లీ పైకి లేచింది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
కేసీఆర్ కోసం ఏపీ భారీ ఏర్పాట్లు: శ్రీవారికిచ్చే కానుకలివే(పిక్చర్స్)
ఆ తర్వాత మరో 20 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టి, ఆ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అదే విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు, అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు ఆరా తీస్తున్నారు.
విమానంలో తిరుమలకు కేసీఆర్: వెలసిన స్వాగత ఫ్లెక్సీలు, తొలగింపు!
తన కోరిక అయిన తెలంగాణ సిద్ధించిన నేపథ్యంలో తిరుమల వెంకన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు కేసీఆర్ తిరుమల వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బయల్దేరుతున్నారు. కాగా, అంతకు ముందే ఆయన కుటుంబసభ్యులు ఎయిరిండియా విమానంలో తిరుపతికి చేరుకున్నారు.