ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏమైంది ? రాపోలు బీజేపిలో !
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కోక్కరుగా పార్టీ మారుతున్నారు.కీలక ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సిద్దాంతకర్తలు ,సీనియర్ పార్టీ సీనియకులు , రాష్ట్ర నాయకులైతే టీఆర్ఎస్ లో దేశ నాయకులైతే బీజేపీలో చేరుతున్నారు.తాజాగా మరో మాజి ఎంపీ పార్టీ సీనియర్ నేత, రాపోల్ అనంద్ భాస్కర్ బీజేపీలో చేరారు.
ఒకదశలో సోనియాగాంధి నేరుగా పిలిచి రాజ్యసభకు నామినేట్ చేసిన రాపోలు ఆనంద్ భాస్కర్ బిజేపిలో చేరడం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. పార్టీ కార్యాలయంలో చాల కాలం పాటు పనిచేసిన రాపోలు నెల రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.దీంతో తాను ఏపార్టీలో చేరనని సైతం ప్రకటించారు.
కాగా నేడు ఆయన ఢిల్లిలో కేంద్రమంత్రి జేపి నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. కాగా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసి కార్యదర్శి,మాజీ ఎంఎల్సీ పోంగులేటీ సుధాకర్ రెడ్డి తోపాటు పార్టీ మరో సీనియర్ నేత డీకే అరుణ సైతం బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే , తెలంగాణ కాంగ్రెస్ లో జిల్లా,రాష్ట్ర్ర స్థాయి నేతలైతే స్థానిక టిఆర్ఎస్ పార్టీలో ,జాతీయ స్థాయి నేతలైతే బీజేపీలో చేరుతుండడం ఆపార్టీ నేతలను గందరగోళానికి గురిచేస్తోంది.