షాక్: మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడికి యత్నం
హైద్రాబాద్ మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో చోరికి ప్రయత్నంనలుగురు నిందితులు కస్టమర్లుగా వచ్చి దోపిడి యత్నంసిసికెమెరాల్లో నిందితుల గుర్తింపు
హైదరాబాద్: హైద్రాబాద్ లో మరోసారి ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడికి విఫలయత్నం ప్రయత్నం చేశారు. ఈ బ్యాంక్ లో దోపిడికి కోసం ప్రయత్నించిన నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. మెదక్ జిల్లాలో జరిగిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడి ఘటనలో ఇటీవలనే పోలిసులు నిందితులను అరెస్టు చేశారు.ఈ ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
మంగళవారం ఉదయం హైద్రాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడికి ప్రయత్నించిన నలుగురు సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించడంతో పారిపోయారు.
మంగళవారం ఉదయం ఏడున్నర గంటల నుండే ముత్తూట్ ఫైనాన్స్ వద్ద కారులో నలుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. బ్యాంక్ ఓపెన్ చేసిన ఐదు నిమిషాలకే నలుగురు వ్యక్తులు కస్టమర్ల మాదిరిగా బ్యాంకులోకి ప్రవేశించారు.
బ్యాంక్ సిబ్బందితో మాట్లాడుతున్నట్టుగా నటించారు. వెంటనే తుపాకులు, కత్తులను చేతబూని మేనేజర్ ను బెదిరించారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది అలారం మోగించారు.
అయితే బ్యాంక్ కింద ఉన్న దుకాణాల వద్ద ఉన్నవారు వెంటనే బ్యాంక్ లోనికి వచ్చారు.అయితే ఈ నలుగురు దొంగలు కూడ తుపాకులు, కత్తులను చూపి అక్కడినుండి తప్పించుకొన్నారు.
అయితే ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంకులో ఉన్న సిసి కెమెరాల్లో నిందితుల వీడియోలు రికార్డయ్యాయి. నిందితులను ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.