కట్నం వేధింపులు!: హైదరాబాద్లో గుంటూరు మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: వరకట్న వేధింపులకు ఓ మహిళ బలైంది! భాగ్యనగరంలోని కూకట్పల్లి నిజాంపేట రోడ్డులోని సెవెన్ హిల్స్ శేషాద్రి అపార్టుమెంటులో ఉండే సుకన్య అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరక్టన వేధింపుల వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
సుకన్య భర్త మహేష్. తన భార్య కొంతకాలంగా తనకు దూరంగానే ఉంటోందని, వరకట్న వేధింపులు కాదని, తాను తన భార్య ఎప్పుడు వేధించలేదని, ఆమె తల్లిదండ్రుల ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకుందని భర్త ఆరోపిస్తున్నారు.
పెళ్లైనప్పటి నుంచి తన కూతురిని భర్త వేధిస్తున్నారని, అదనపు కట్నం కోసం డిమాండ్ చేసేవాడని సుకన్య తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా, సుకన్యది గుంటూరు జిల్లా అని తెలుస్తోంది. ఎక్కడికైనా వెళ్తే కుటుంబ సభ్యులను కాకుండా స్నేహితులను తీసుకు వెళ్లేవాడని ఆరోపించారు.

సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గణపతి వరంగల్ జిల్లాలో అదృశ్యమయ్యాడు. సికింద్రాబాద్ - మణుగూరు రైల్లో వెళ్తుండగా వరంగల్ జిల్లా కాజీపేట వద్ద గణపతి అదృశ్యమైనట్లు తోటి కానిస్టేబుల్ డోర్నరకల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణపతి ఛత్తీస్గఢ్ కుంటాలోని సుక్మా బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన స్వస్థలం తమిళనాడులోని థేని జిల్లా అందిపట్టి.
లోయర్ ట్యాంక్బండ్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య
భాగ్యనగరంలోని లోయర్ ట్యాంక్బండ్ సమీపంలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ట్రాన్స్ఫార్మర్కు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. ఈ సంఘటన పైన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications