ఎంపీ డీఎస్ కొడుకు సంజయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, 11 మంది అమ్మాయిలు ఫిర్యాదు
Recommended Video
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 11 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు, మహిళా సంఘం నేతలు కలిసి హో మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని కలిశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు హోంమంత్రి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
తన సొంత శాంకరి నర్సింహ్ కళాశాలలోని విద్యార్థులను సంజయ్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రేపు డీజీపీ, కమిషనర్ను కలవాలని హోంమంత్రి నాయిని వారికి సూచించారు. తక్షణం సంజయ్ను అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ సందర్భంగా నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని చెప్పారు. హోంమంత్రిని కలిసిన అనంతరం పీవోడబ్ల్యు సంధ్య మీడియాతో మాట్లాడారు. తక్షణం సంజయ్ను అరెస్టు చేయాలన్నారు. కాలేజీ పర్మిషన్ రద్దు చేయాలన్నారు.