ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి: టి స్పీకర్కు గడువిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నమోదైన ఫిర్యాదులపై ఎప్పటిలోగా పరిష్కరిస్తారో నవంబరు 8లోగా తెలపాలంటూ శాసన సభ స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనేలా ఆదేశాలివ్వాలంటూ శాసన సభ్యుడు సంపత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ ఫాలీ నారిమన్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రాగా.. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని తెలంగాణ తరఫు న్యాయవాది ఉదయ్కుమార్ సాగర్ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

2014లో ఎన్నికలు జరిగాయని, ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వీలైనంత త్వరగా స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ 2015లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సైతం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన శాసన సభ్యులపై ఫిర్యాదులను ఏప్పటిలోగా తేలుస్తారో నవంబరు 8వ తేదీలోగా తెలపాలని బెంచ్ స్పీకర్ను ఆదేశించింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గైర్హాజరు దృష్టిలో పెట్టుకొని ఈ కేసు తదుపరి విచారణను నవంబరు 8కి వాయిదా వేసింది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications