కాపురానికి రావడం లేదని భార్య గొంతు కోసిన భర్త
నల్లగొండ : తన వెంట హైదరాబాద్కు కాపురానికి రావడం లేదనే కోపంతో ఓ వ్యక్తి భార్య గొంతు కోశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామపంచాయతీ పరిధిలోని మదనాపురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఎస్ఐ డేనియల్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం - గ్రామానికి చెందిన బక్క భాస్కర్- శైలజ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు. భాస్కర్ ఆరు నెలల క్రితం హైదరాబాద్కు వెళ్లి అక్కడి ఓ షాపులో పని చేస్తున్నాడు. భార్యా పిల్లలను కూడా తన హైదరాబాద్కు రావాలని కోరాడు. దీనికి భార్య అందుకు ఒప్పుకోలేదు.
ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం గ్రామంలో జరిగిన ఓవివాహనికి హాజరయ్యేందుకు భాస్కర్ వచ్చాడు. భార్య తన వెంట రావడం లేదనే కోపంతో ఇంట్లో నిద్రిస్తున్న బక్క శైలజ (32)పై కత్తితో దాడిచేసి గొంతు కోశాడు.
తీవ్రంగా గాయపడిన శైలజను స్థానికులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శైలజ అన్న ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న ఎస్ఐ డేనియల్కుమార్ సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.