పబ్లిక్ పార్కుల్లో అసభ్యం: 11 యువ జంటల అరెస్ట్
హైదరాబాద్: నగరలోని పలు పార్కుల్లో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్న 11 జంటలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి, తదితర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులే ఎక్కువగా ఈ పార్కుల్లో దర్శనమిస్తుండటం గమనార్హం.
కాగా, కళాశాలలకు సమీపంలోని నందనవనం పార్కులో యువ జంటల తాకిడి మరింత ఎక్కువగా ఉంది. ప్రశాంతత కోసం వచ్చే పలువురు పెద్దలు.. ఈ యువజంటలు చేస్తున్న అసభ్య కార్యకలాపాలపై తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. పబ్లిక్ న్యూసెన్స్ కింద పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు.

పార్కుల్లోని వివిధ ప్రాంతాల్లో కూర్చుంటున్న యువ జంటలు.. ఎవరినీ పట్టించుకోకుండా అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కాలేజీలకు వెళ్లడం మాని.. పార్కులకు వచ్చే ఇతరుల పట్ల కళాశాల విద్యార్థులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెప్పారు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా వేసి సదరు జంటలను పట్టుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. వారిపై పెట్టి కేసు నమోదు చేసి, ఆ తర్వాత వదిలేశామని తెలిపారు. కాగా, విద్యార్థినీ, విద్యుర్థులు పార్కులకు రాకూడదా?, పోలీసులు తమను ఎందుకు వేధిస్తున్నారంటూ కొందరు విద్యార్థులు తిరిగి ప్రశ్నిస్తుండటం గమనార్హం.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications