హైదరాబాద్ శేరిలింగంపల్లిలో దారుణం: భార్యాపిల్లలను చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని శేరిలింగంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యా పిల్లలను హత్య చేసి, అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నాగరాజు అనే వ్యక్తి పాత ఇనుప సామాగ్రి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తన భార్య సుజాతతో తరచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా వాళ్ల మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో అదే రాత్రి భార్యతోపాటు కుమారుడు సిద్ధార్థ, కుమార్తె రమ్యశ్రీలపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నాగరాజు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా తలుపులు మూసి ఉండటం.. ఇంటి నుంచి దుర్వాసన రావడం గుర్తించారు స్థానికులు.
ఈ నేపథ్యంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా.. ఆ కుటుంబమంతా విగత జీవులుగా పడివున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications