వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద్రాబాద్‌లో ట్రిపుల్ తలాక్: భర్తపై న్యాయ పోరాటం, సుష్మా స్వరాజ్‌ సహయం కోరిన బాధితురాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఎలాంటి కారణం లేకుండానే ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తపై ఓ భార్య న్యాయపోరాటానికి సిద్దమైంది. తనకు న్యాయం చేయాలని కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు బాధితురాలు లేఖ రాసింది.

హైద్రాబాద్‌కు చెందిన షేక్ చాంద్‌పాషా తన కూతురును 2008 ఆగష్టు 11వ, తేదిన ఒమన్‌కు చెందిన జహరన్ హమీద్ అల్ రజీ అనే వ్యక్తికిచ్చి పెళ్ళి చేశాడు. వివాహానికి కొందరు మధ్యవర్తిత్వం వహించారని బాధితురాలు మీడియాకు తెలిపింది.

Hyderabad woman claims Omani husband gave Triple Talaq over phone, seeks Sushma Swaraj’s help

వివాహం తర్వాత తన భర్త తనను ఒమన్‌కు తీసుకెళ్ళలేదని చెప్పారు. అప్పుడప్పుడు హైద్రాబాద్ వచ్చేవాడని తెలిపింది.హైద్రాబాద్‌కు వచ్చిన సమయంలో తనకు ఖర్చుల నిమిత్తం డబ్బులను ఇచ్చేవాడని బాధితురాలు తెలిపింది

హైద్రాబాద్‌లో తన భర్త తనకు ఇల్లును ఇప్పిస్తాడని హమీ ఇచ్చిందని బాధితురాలు తెలిపారు. అయితే తన గురించి తమ వివాహం జరిపించిన మధ్యవర్తుల ద్వారా సంప్రదిస్తే ఎప్పటికప్పుడు దాట వేసేవారని ఆమె చెప్పారు.

అయితే ఈ నెల 15వ, తేదిన జహరాన్ తనకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే తాను చేసిన తప్పేంటో చెప్పకుండా తలాక్ చెప్పడంలో ఆంతర్యమేమిటని బాధితురాలు ప్రశ్నించారు.ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు.

English summary
While a national-level debate is going on over the issue of Triple Talaq and the proposed Bill by the Centre to criminalise instant Triple Talaq, a woman from Hyderabad has claimed that she was divorced by her husband living in Oman over a phone call ‘without following the due procedures’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X