మాకు సంబంధంలేదు: టీడీపీపై కిషన్, సెక్షన్8 సహా తేల్చేసిన బీజేపీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి షాకిచ్చింది. ఓటుకు నోటు, సెక్షన్ 8తో తమకు ఏమాత్రం సంబంధం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. సెక్షన్ 8 లేదని రెండు రోజుల క్రితమే కిషన్ చెప్పారు.
గురువారం నాడు బీజేపీ తెలంగాణ కోర్ కమిటీ భేటీ అయింది. అనంతరం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై దాదాపు మౌనంగా ఉన్న బీజేపీ (తెలంగాణ) ఇప్పుడు పెదవి విప్పింది.
ఓటుకు నోటు, సెక్షన్ 8తో తమకు సంబంధం లేదని కిషన్ చెప్పారు. సెక్షఖన్ 8తో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయని చెప్పారు. దీని వల్ల ఉద్రిక్తలు తలెత్తుతాయని హెచ్చరించారు. రెండు పార్టీల సమస్యను ప్రాంతీయ సమస్యగా మార్చారని చెప్పారు. సెక్షన్ 8 కేంద్రం పరిధిలోని అంశమని చెప్పారు.
అన్ని వర్గాల్లో అసంతృప్తి: ఉత్తమ్
తెలంగాణ రాష్ట్ర సమితి పాలన పైన అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.