ప్రాణం తీసిన సహజీవనం: చీరతో ఉరేసి ప్రియురాలి దారుణ హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని బృందావన్ కాలనీలో జూన్ 2న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
శనివారం ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్వర్, ఎస్ఐ లింగస్వామి తెలిపిన విరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం రాందాస్పల్లి గ్రామానికి చెందిన ఎదుల్ల శారదమ్మ(35) భర్త మూడేళ్ల క్రితం చనిపోవడంతో ఇద్దరు పిల్లతో బృందావన్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటోంది.
రెండు నెలల కిందట ఇబ్రహీంపట్నం కల్లు దుకాణంలో శారదమ్మకు మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన సపావట్ రాజ్కుమార్(27)తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
రాజ్కుమార్కు అంతకుముందే భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, వారికి దూరంగా ఉంటున్నాడు. జూన్ 2న రాజ్కుమార్, శారదమ్మ గొడవ పడ్డారు. ఆగ్రహంతో చీరతో శారదమ్మను ఉరి తీశాడు రాజ్కుమార్.
పోలీసుల విచారణలో రాజ్కుమార్ తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడని తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తానే హత్య చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. భార్య దగ్గరవుతుండటంతోనే శారదమ్మను హత్య చేసివుంటాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.