గ్రేటర్ ఓటర్లకు ‘శ్రీమంతుడి’ పిలుపు: జీహెచ్ఎంసీ పరిధిలో రేపు సెలవు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నగర ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
అందమైన హైదరాబాద్ నగరాని కోసం తమ విలువైన ఓటును వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. మహేష్ మీదున్న అభిమానంతో అనేక మంది ఆయన అభిమానులు గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిద్దాం.
Please go and vote to make each vote count! pic.twitter.com/8ZimIaDlvk
— Mahesh Babu (@urstrulyMahesh) February 1, 2016 రేపు సెలవు
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం సెలవు దినం పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా చూడాలని 3 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఓటరు కార్డు తప్పనిసరి
ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఓటరు గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకొనిరావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి ఓటర్లకు సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఇతర గుర్తింపుకార్డులు తీసుకొనిరావాలన్నారు.
ప్రతి వార్డుకు జోనల్ అధికారులను నియమించి శిక్షణ ఇచ్చామని, ఎలక్ట్రానిక్ పరికరాలు మొరాయిస్తే.. వాటి స్థానంలో తక్షణమే కొత్తవి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications