ప్రియుడి కోసం 2ఏళ్ళ బిడ్డను చంపేందుకు నీకు మనసెలా వచ్చింది.. నీదొక బ్రతుకేనా!
ఆడవాళ్లు ఆడతనాన్ని మర్చిపోతున్నారు. రాక్షసులుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తలను, చివరికి పిల్లలను కూడా హత మారుస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు కోసం కడుపున పుట్టిన రెండేళ్ల పాపను కర్కశంగా కడతేర్చింది ఓ ఇల్లాలు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పాతిపెట్టి ప్రియుడితో పారిపోయింది. వివరాలలోకి వెళితే
మే నెల నుండి మాయమైన తల్లీ కూతుళ్ళు
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లి కి చెందిన బొట్టు మమతకు, బంటు భాస్కర్ దంపతులకు ఇద్దరు సంతానం. ఒక కొడుకు, కూతురు. అయితే మమతకు తన తల్లిగారి గ్రామమైన శభాష్ పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మే నెల నుంచి మమత ఆమెతోపాటు కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

గుంటూరు జిల్లాలో తల్లిని, ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మమత గుంటూరులో ఉందని గుర్తించి మమతను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల కుమార్తె గురించి మమతను విచారణ చేసిన పోలీసులకు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి శభాష్ పల్లికి వచ్చి శభాష్ పల్లి శివారులోనే పాపని చంపి పాతి పెట్టి, మళ్ళీ తిరిగి నరసరావుపేటకు వెళ్ళిపోయారు.
చిన్నారిని చంపిన కర్కశ తల్లి
ఇక ఈ విషయం మమత, ఆమె ప్రియుడు ఇద్దరు పోలీసులు ముందు ఒప్పుకున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి శవాన్ని బయటకు తీశారు. తహసిల్దార్ తో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే గతంలో కూడా మమత ప్రియుడితో పారిపోవడంతో ఆమె ప్రవర్తన పైన భర్త అభ్యంతరం వ్యక్తం చేసి ఆమెతో కలిసి జీవించడానికి నిరాకరించాడు.
తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారి హత్య
భర్త నిరాకరించిన మమత తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఐదేళ్ల కొడుకును తల్లిదండ్రుల దగ్గర వదిలేసి, మళ్లీ ప్రియుడితో పారిపోయింది. రెండేళ్ల కుమార్తె అడ్డుగా ఉందని అత్యంత కర్కశంగా చంపి ప్రియుడితో పరార్ అయింది ఈ కర్కశ తల్లి. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు వీరిని కోర్టులో హాజరు పరిచారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications