ఆడంగి వేషాలు సరే: నయీం మారు పేరు జేమ్స్
హైదరాబాద్: నయీం ఆడంగి వేషాలు కూడా వేశాడనే విషయం అటుండగా, అతనికి మారు పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆడవేషాల్లో, బుర్ఖాలు ధరించి నయీం సంచరించే నయీం జేమ్స్ అనే పేరుతో కూడా చెలామణి అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్లను అణచివేయడానికి నయీం ఇన్ఫార్మర్గా పోలీసులు ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత అతను ఛత్తీస్గడ్ పోలీసులకు దగ్గరయ్యాడు. తమ రాష్ట్రంలో నక్సలైట్లను అణచివేయడానికి నయీంను వాడుకోవాలని ఛత్తీస్గడ్ పోలీసులు భావించినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో అతను జేమ్స్ అనే మారు పేరుతో చెలామణి అయినట్లు చెబుతున్నారు. సిట్ అధికారులు గురువారంనాడు నల్లగొండ జిల్లా భవనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టల్లో పలువురిని విచారించినట్లు తెలుస్తోంది. నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుతో సంబంధాలు పెట్టుకున్న 20 మందికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.
భూములను, భవనాలను నయీం ముఠా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఓ అధికారిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రత్యేక దృష్టి సారించింది. నయీంకు చెందిన రిజిస్ట్రేషన్లు ఆ అధికారి ద్వారా ఎక్కువ జరిగినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా కొనసాగిన అతను ప్రస్తంతం అధికారి హోదాలో ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.