కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురు యువతుల అదృశ్యం, లేడీ డాక్టర్ని ప్రేమించి ముఖం చాటేసిన డాక్టర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో శుక్రవారం నాడు ఒకేరోజు ముగ్గురు విద్యార్థునులు అదృశ్యమయ్యారు. జవహర్ నగర్‌కు చెందిన శ్రీనిఖిత కాలేజీకి వెళ్లింది. ఆమె తన అత్త కూతురు రితికను కూడా తన వెంట తీసుకు వెళ్లింది. వారు హాల్ టిక్కెట్ కోసం వెళ్లారు. కానీ ఆ తర్వాత అదృశ్యమయ్యారు.

బోరబండ వినాయక నగర్‌కు చెందిన ఎలీషా అనే యువతి పరీక్ష రాసేందుకు చార్మినార్ కళాశాలకు వెళ్లింది. ఆమె కూడా కనిపించడం లేదు. సాయంత్రం అయినా ఎలీషా రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె స్నేహితురాలు శ్రీదేవికి ఫోన్ చేశారు. ఎలీష అసలు పరీక్షనే రాయలేదని చెప్పారు. ఎలీష పరీక్ష రాసేందుకు బస్సులో వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Nirbhaya case against doctor in Kunrool district

డాక్టర్ పైన నిర్భయ కేసు

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వైద్యుడు రాకేష్ పైన కర్నూలు జిల్లాలో నిర్భయ కేసు నమోదయింది. రాకేష్, మరో లేడీ డాక్టర్ కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీలో ప్రేమించుకున్నారు. ప్రేమించిన రాకేష్ ముఖం చాటేశాడని లేడీ డాక్టర్ ఫిర్యాదు చేసింది. దీంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. రాకేష్ పైన, కుటుంబ సభ్యుల పైన కేసు నమోదయింది.

ఎంపీపీ కార్యాలయంపై పోలీసుల దాడి

ఘట్‌కేసర్ ఎంపీపీ కార్యాలయంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎంపీపీ సోదరుడు సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 20 వేలు, 5 బైక్‌లు, 12 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Nirbhaya case against doctor in Kunrool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X