బాలుడిని ఎందుకు చంపారు?: హత్య కేసులో అన్నీ అనుమానాలే..
గాంధీనగర్లో దారుణహత్యకు గురైన కడారి వినయ్ని ఎవరు, ఎదుకు హతమార్చారనేది తేలడం లేదు.
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా గాంధీనగర్లో దారుణహత్యకు గురైన మూడో తరగతి విద్యార్థి కడారి వినయ్ని ఎవరు, ఎదుకు హతమార్చారనే అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనుమానితులుగా భావిస్తూ అబ్బనికుంటకు చెందిన మధు, రాజేశ్లను ఇప్పటికే మిల్స్కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీ లాగుతున్నారు.
అయితే, అధికారికంగా ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. బుధవారం సాయంత్రం క్రిస్టియన్ కాలనీలోని తాను చదువుతున్న యూనిక్ పాఠశాల నుంచి చిన్నారి ఇంటికి వెళ్లేందుకు ఉపక్రమించిన తరుణంలో అపహరణకు అనంతరం హత్యకు గురయ్యాడు. ఈ ఉదంతంపై పోలీసులు పూర్తిస్థాయిలో మరోమారు పాఠశాలలో ఆరా తీశారు.

గురువారం రాతి, శుక్రవారం స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. పాఠశాల లోపల మాత్రమే సీసీ కెమెరాలు ఉండడంతో పాఠశాల వదిలిన అనంతరం బాలుడిని ఎవరు ఎత్తుకుపోయారు, ఎలా ఎత్తుకు పోయారనే విషయాలను పాఠశాల సమీపంలోని ఇళ్ల ముందు అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించేందుకు యత్నించారు.
బాలుడి మృతదేహం గురువారం ఉదయం వెలుగు చూసిన నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ ద్వారా లభించిన సాక్ష్యాలతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.బాలుడు బడి నుంచి బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు రోజు వెళ్లే ఆటోలోనే తన బ్యాగును పెట్టి ఆటోలో కూర్చునే క్రమంలో అనుమానిత వ్యక్తిగా భావిస్తున్న మధు బాలుడిని పిలిచినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఆ వ్యక్తిని చూడగానే బాలుడు తనకు సుపరిచయస్తుడిగా భావించి బ్యాగును అందులోనే వదిలి అతని వద్దకు వెళ్లినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అనంతరం వరంగల్ ఆటోనగర్ వైపు మరో వాహనంలో బాలుడిని తీసుకెళ్లి చంపినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications