రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం: టీడీపీకి రాజీనామా!?
హైదరాబాద్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ తన సోదరుడు కొండల్ రెడ్డితో ఆసక్తికర అంశం చెప్పినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలవాలని, తాను పార్టీని వీడే అంశంపై ఆయనతో చర్చించాలని సోదరుడు కొండల్ రెడ్డికి రేవంత్ సూచించినట్లుగా వినికిడి.

మంగళవారం నాడు ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, పయ్యావుల కేశవ్ తదితరులు చంచల్ గూడ జైలులో రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా రేవంత్ తన సోదరుడితో మాట్లాడుతూ... పయ్యావులతో కలిసి చంద్రబాబును కలవాలని, పార్టీకి తాను రాజీనామా చేసే అంశంపై చర్చించాలని సూచించారని తెలుస్తోంది. ఈ లంచం ఇవ్వజూపిన కేసులో పార్టీని, చంద్రబాబును దూరంగా ఉంచాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారికి మలికి అంటించకుండా రేవంత్ పూనుకున్నారని భావించవచ్చునని అంటున్నారు.
మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. అతనిని గంగా బ్యారెక్లో ఉంచారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications