హైదరాబాద్ చేరుకున్న సత్యనాదెళ్ల
హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్(81) అనారోగ్యంతో బంజారాహిల్స్లోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం యుగంధర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
తండ్రి అంత్యక్రియల కోసం సత్య నాదెళ్ల లండన్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుక్కాపురం నాదెళ్ల(బీఎన్) యుగంధర్ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. 1962 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన యుగంధర్.. ఆంధ్రప్రదేశ్ తోపాటు కేంద్ర ప్రభుత్వంలోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయ, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగంలో సేవలు అందించారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో 2004-2009 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు.
1988-1993 వరకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమికి డైరెక్టర్గా విధులు నిర్వహించారు. ఐఏఎస్గా సేవలందించిన యుగంధర్.. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. కాగా, తన తండ్రి కమ్యూనిస్టు కాదని, కానీ కొన్ని కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయని గతంలో సత్య నాదెళ్ల చెప్పారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications