ఓటుకు నోటు కేసులో రెండోరోజు కొనసాగుతోన్న రేవంత్ విచారణ
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మంగళవారం 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. బుధవారం రెండోరోజు విచారణకు పిలించింది. రేవంత్ ను విచారించే సమయంలో అందుబాటులో ఉండాలని ఐటీ, ఏసీబీ అధికారులను కోరింది ఈడీ.

క్రాస్ ఇంటరాగేషన్ ..
ఓటుకు నోటు కేసులో డబ్బులు తీసుకొచ్చిన ఉదయ్ సింహ ... ఎమ్మెల్సీగా బరిలో ఉన్న వేం నరేందర్ రెడ్డి ఈడీ అధికారులు విచారించారు. వారిని ప్రశ్నించిన అంశాలే రేవంత్ ను ఇంటరాగేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రూ.50 లక్షలు ఎక్కడివి ?. ఎవరిచ్చారు ..? నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇస్తానన్న రూ.4.50 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చే వారు ? ఈ నగదును ఎవరు సమకూర్చారు. అనే అంశంపై ఈడీ అధికారులు తిప్పి తిప్పి రేవంత్ ను ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం జరగిన విచారణలో ఆయన తనకేమీ తెలియదు .. కాదు అనే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రెండోరోజు విచారణకు రావాలని అధికారులు కోరినట్టు స్వయంగా రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.

ముందు విడి విడిగా .. తర్వాత ఒకేసారి విచారణ
ఈ కేసులో ముందుగా ఉదయ్ సింహ, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డిని విడి విడిగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సమయంలో వారు చెప్పే సమాధానాలను రికార్డ్ చేస్తున్నారు. సాధారణంగా ఈడీ విచారణ ఓ బుక్ లేట్ ఇచ్చి అందులో ఉన్న ప్రశ్నలకు సమాధానం నింపాల్సి ఉంటుంది. తిప్పి తిప్పి ప్రశ్నించడంతో ... తడబడి చెప్పే సమాధానంతో విచారణలో పురోగతి సాధిస్తుందని అధికారులు భావిస్తున్నారు. తర్వాత అందరినీ ఒకేసారి పిలిచి .. మళ్లీ ప్రశ్నిస్తారు. ఈ సమయంలో సంధించే ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానాలను బట్టి విచారణ ఉంటుంది. ఆ రెండు సమాధానాలు సరిపోకుంటే ... విచారణ వేగిరమై కేసు కొలిక్కి వస్తోందిన ఈడీ భావిస్తోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications