బెట్టింగ్ భూతానికి సాఫ్ట్వేర్ ఉద్యోగి బలి...
ప్రస్తుత కాలంలో ఈజీ మనీ కోసం ప్రజలు ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ ల ఘటనలో పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ లోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై చివరకు రూ.80 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అయితే అప్పులు తిరిగి చెల్లించాలని ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో.. జీవితం కొనసాగించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్లను తక్షణమే నిషేధించాలని మృతుడి భార్య కోరింది.

ఇక సంజయ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెట్టింగ్ యాప్ ల ద్వారా సంజయ్ ఎంత నష్టపోయాడు? ఎవరి వద్ద ఎంత అప్పులు చేశాడు అని పోలీసులు విచారణ చేపట్టారు. ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications