సూర్యాపేటలో విషాదం: పెళ్లైన ఆరోరోజే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: కార్తీక స్నానం కోసం కృష్ణానదిలోకి దిగిన సాప్ట్వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, సూర్యాపేటకు చెందిన కనపర్తి మహేశ్(50), మేనల్లుడు మేగరాజు ప్రశాంత్ (27)తో కలిసి అత్తగారి గ్రామమైన నల్గొండ జిల్లా మునగాలకు బుధవారం వెళ్లారు.
కార్తీకపౌర్ణమి సందర్భంగా మునగాలలో నాగార్జునసాగర్ హెడ్రెగ్యులేటర్ వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు నీటిలోకి దిగారు. స్నానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గట్టిగా కేకలు వేయడంతో ఇది గమనించిన స్థానికులు నీటిలో కొట్టుకుపోతున్న ప్రశాంత్ను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.

మహేశ్ ఆచూకీ మాత్రం లభించలేదు. అప్పటికే అపస్మారక స్థితికి చేరిన ప్రశాంత్ను అంబులెన్స్లో కోదాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రశాంత్కు ఈ నెల 19న వివాహమైంది. మహేశ్ గల్లంతవడం, ప్రశాంత్ మృతి చెందడంతో బంధువుల ఇంట్లో రోదనలు మిన్నంటాయి.
కాగా ప్రశాంత్ ఆస్టేలియాలో సాప్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి అయిన ఆరు రోజులకే ప్రశాంత్ మృత్యువాతపడడంతో వధువు కుటుంబసభ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications