చంద్రబాబు ఏం సాధిస్తారు: తలసాని సంచలన వ్యాఖ్యలు
Recommended Video

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం సాధిస్తారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. శనివారంనాడు ఆయన అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
విభజన హామీలపై పోరాటం చేయకుండా ప్రజలను అన్ని పార్టీలూ మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎపిది న్యాయమైన కోరిక అని తమ పార్టీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కవిత చెప్పినట్లు ఆయన చెప్పారు. ఎపి ప్రజలు ఆపరేషన్లను నమ్మే స్తితిలో లేరని ఆయన అన్నారు.

పోరాట స్ఫూర్తి లేదు
ఆంధ్రప్రదేశ్ నాయకులకు పోరాట స్ఫూర్తి లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎెపి ఎంపీలు రాజీనామాలు చేస్తే దేశం దృష్టిని ఆకర్షిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు

కేసీఆర్ నాయకత్వం వహిస్తారు
దేశంలో ఎక్కడ సమస్యలున్నా తమ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నాయకత్వం వహిస్తారని తలసాని చెప్పారు. ఏపి ప్రజలు కూడా కోరుకుంటే నాయకత్వానికి కేసిఆర్ సిద్ధమేనని అన్నారు.

టిడిపి సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది..
ఎపిలో టిడిపి సెల్ఫ్ గోల్ చేసుకుంటోందని తలసాని అన్నారు. చంద్రబాబు ఎన్డీఎ నుంచి వైదొలిగిన తర్వాత అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అన్నారు. కలిసి ఉన్నప్పుడు ప్రశ్నించి ఉంటే ఉపయోగం ఉండేదని అన్నారు.

చంద్రబాబుకు ఎందుకు
నిన్నటి వరకు టిడిపి, బిజెపి కలిసే ఉన్నాయని తలసాని అన్నారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు లేవనెత్తలేదని ఆయన అడిగారు. వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఎవరిని కలిస్తే చంద్రబాబుకు ఎందుకని అడిగారు. ఎపి ప్రజల ఆవేదన చసి తాను మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications