Telangana Tenth Results 2024: పదో తరగతి ఫలితాలు విడుదల..
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.23 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో పరీక్షల్లో బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించి పై చేయి సాధించారు. ఇక బాలురు 89.42 శాతం ఉత్తీర్ణతతో వెనకబడ్డారు. రాష్ట్రంలో 3927 పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు పాసయ్యారు. నిర్మల్ జిల్లా 99 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
వికారాబాద్ 65.10 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఆరు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలికలు 2,50, 433 మంది ఉండగా.. బాలురు 2,70,952 మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి ఆన్ లైన్ మెమోల కోసం https://results.bsetelangana.org/ వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షల్లో ఫెలైన విద్యార్థులకు జూన్ లో సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి 13 తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధింత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.
-
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం!












Click it and Unblock the Notifications