ప్రారంభమైన తెలంగాణ టిడిపి మహానాడు, గైరాజరైన ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. ఈ మహానాడుకు ఎల్బీనర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గైరాజరయ్యారు.మూడురోజుల క్రితమే కృష్ణయ్యతో బిజెపి నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. ఈ మహానాడుకు ఎల్బీనర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గైరాజరయ్యారు.మూడురోజుల క్రితమే కృష్ణయ్యతో బిజెపి నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సమావేశమయ్యారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ టిడిపి మహనాడు ప్రారంభమైంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా నిర్వహిస్తున్న మహనాడులో పార్టీకి చెందిన ఎమ్మెల్యే గైరాజర్ కావడం చర్చకు దారితీస్తోంది.
మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు పురంధరేశ్వరి సోమవారం సాయంత్రం విద్యానగర్ లో కృష్ణయ్యతో సమావేశమయ్యారు. కృష్ణయ్యను బిజెపిలోకి ఆహ్వానించేందుకు ఆమె ఆయనతో సమావేశమయ్యారనే ప్రచారం సాగింది.
అయితే అదే సమయంలో తన కొడుకు వివాహనాకి హాజరుకాలేనందున నూతనవధూవరులనుఆశ్వీర్వదించేందుకు ఆమె వచ్చినట్టు కృష్ణయ్య వివరించారు. పార్టీ మహనాడుకు ఆయన గైరాజర్ కావడం పట్ల పార్టీ శ్రేణులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి.కృష్ణయ్య కూడ పార్టీ మారుతారా...పార్టీలోనే కొనసాగుతారా అనే చర్చ పార్టీవర్గాల్లో సాగుతోంది.