వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రారంభమైన తెలంగాణ టిడిపి మహానాడు, గైరాజరైన ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. ఈ మహానాడుకు ఎల్బీనర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గైరాజరయ్యారు.మూడురోజుల క్రితమే కృష్ణయ్యతో బిజెపి నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సమావేశమయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. ఈ మహానాడుకు ఎల్బీనర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గైరాజరయ్యారు.మూడురోజుల క్రితమే కృష్ణయ్యతో బిజెపి నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సమావేశమయ్యారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ టిడిపి మహనాడు ప్రారంభమైంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా నిర్వహిస్తున్న మహనాడులో పార్టీకి చెందిన ఎమ్మెల్యే గైరాజర్ కావడం చర్చకు దారితీస్తోంది.

Telangana Tdp Mahanadu started in Hyderabad

మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు పురంధరేశ్వరి సోమవారం సాయంత్రం విద్యానగర్ లో కృష్ణయ్యతో సమావేశమయ్యారు. కృష్ణయ్యను బిజెపిలోకి ఆహ్వానించేందుకు ఆమె ఆయనతో సమావేశమయ్యారనే ప్రచారం సాగింది.

అయితే అదే సమయంలో తన కొడుకు వివాహనాకి హాజరుకాలేనందున నూతనవధూవరులనుఆశ్వీర్వదించేందుకు ఆమె వచ్చినట్టు కృష్ణయ్య వివరించారు. పార్టీ మహనాడుకు ఆయన గైరాజర్ కావడం పట్ల పార్టీ శ్రేణులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి.కృష్ణయ్య కూడ పార్టీ మారుతారా...పార్టీలోనే కొనసాగుతారా అనే చర్చ పార్టీవర్గాల్లో సాగుతోంది.

English summary
Telangana Tdp Mahanadu started at Nampally exhibition grounds on Wednesday.LB Nagar Tdp Mla R. krishnaiah didn't attend this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X