వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృతి: అవే నీళ్లు తాగిన జనం
నల్గొండ: అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి చేటు తెచ్చేలా మారింది. వివరాల్లోకి వెళితే.. తాగునీటి వాటర్ ట్యాంకులో పడి దాదాపు 30-40 కోతులు మృతి చెందాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని హిల్ కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసింది. విజయవిహార్ సమీపంలోని 200 గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు నీటి సరఫరా విభాగం ఓ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు.
అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకులోని నీళ్లు తాగేందుకు కోతులు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ట్యాంకులోకి దిగిన వానరాలకు బయటకు వచ్చే దారి దొరక్క.. అందులోనే మృతి చెందాయి. అయితే, ఆలస్యంగా మేలుకొన్న అధికారులు దాదాపు 30 కోతుల మృతదేహాలను గుర్తించి బయటకి తీశారు.

కాగా, తాగునీటి ట్యాంకులో కోతులు మృతి చెందిన విషయం వెలుగు చూడటంతో స్థానికంగా నివసించే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కోతులు చనిపోయి దాదాపు పది రోజులపైనే అయిఉంటుందని, అప్పట్నుంచి ఆ నీటినే తాగుతున్నామని చెబుతున్నారు. అనారోగ్యం బారిన పడతామని భయాందోళనలకు గురవుతున్నారు.

కాలనీలోని నివాసగృహాలకు నీటిని సరఫరా చేసే ట్యాంకులను తరచూ చేయాల్సి ఉండగా.. అధికారులు మాత్రం ఏనాడూ శుభ్రం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం వహించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన నీటి సరఫరా విభాగం అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications